భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని సోవియట్ రాయబారి నికోలాయ్ కుడాషేవ్ అన్నారు. 2020లో ఇరుదేశాల మధ్య పరస్పర సైనిక సహకారం, ఉగ్రవాద నిరోధక చర్యలపై నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
'ఉగ్రవాదంపై భారత్-రష్యా ఉమ్మడి పోరు'
భారత్-రష్యాల మధ్య పరస్పర సైనిక సహకారంపై 2020లో చర్చలు జరగనున్నాయని సోవియట్ రాయబారి నికోలాయ్ కుడాషేవ్ అన్నారు. పరస్పర సహకారంతో ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బ్రిక్స్, ఎస్సీఓ, ఆర్ఐసీలు రూపొందించిన నిబంధనల మేరకు భారత్-రష్యాల మధ్య ఈ సైనిక సహకారం, ఉగ్రవాద నిరోధక చర్యలపై చర్చలు జరుగనున్నాయని నికోలాయ్ తెలిపారు. త్వరలోనే యురేషియా ఎకనామిక్ యూనియన్- భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగాలని రష్యా ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రవర్తన నియమాల అనుసారం.. భారత్, రష్యాలు పరస్పర గౌరవంతో మెలుగుతాయని అన్నారు. ఒకరి దేశీయ అంతర్గత విషయాల్లో మరొకటి జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:బోయింగ్ నూతన సీఈవోగా డేవిడ్ కాల్హూన్