తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా దళాలున్న ఇరాక్​ స్థావరంపై రాకెట్​ దాడి - ఇరాక్​లోని సైనిక స్థావరాలపై మరోసారి దాడి

అమెరికా దళాలున్న ఇరాక్​ స్థావరంపై కత్యుషా రాకెట్​తో ​మరోసారి దాడి జరిగిందని ఆ దేశ సైనికాధికారులు తెలిపారు. ఇరాక్​-అమెరికా సంకీర్ణ దళాలున్న తాజీ స్థావరం వద్ద జరిగిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు.

Rockets target Iraq airbase hosting US forces
అమెరికా దళాలున్న ఇరాక్​ స్థావరంపై రాకెట్​ దాడి

By

Published : Jan 15, 2020, 4:50 AM IST

Updated : Jan 15, 2020, 7:38 AM IST

ఇరాక్​లోని సైనిక స్థావరాలపై మరోసారి దాడి జరిగింది. అమెరికా సంకీర్ణ దళాలున్న తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్​ పేలినట్లు ఇరాక్​ మిలటరీ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది ఇరాక్. అయితే ఎన్ని రాకెట్లతో దాడి జరిగిందనే విషయాన్ని వెల్లడించలేదు.

అమెరికా-ఇరాన్​ ఉద్రిక్తతలు తీవ్రమైనప్పటినుంచి ఇరాక్​లోని అగ్రరాజ్య స్థావరాలపై పలుమార్లు రాకెట్లతో దాడి జరిగింది. ఇరాన్​ అగ్రనేత ఖాసీం సులేమానీ హత్య అనంతరం అమెరికా స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్​ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడి కూడా ఇరాన్​ పనేనని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ డిమాండ్లకు విలువలేదు: 'ఈటీవీ భారత్'​తో​ జేఎన్​యూ వీసీ

Last Updated : Jan 15, 2020, 7:38 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details