తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 7:16 AM IST

Updated : Dec 18, 2019, 10:43 AM IST

ETV Bharat / international

బోరిస్ కేబినెట్​లో ముగ్గురు భారత సంతతి మంత్రులు

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బోరిస్ జాన్సన్.. తన మంత్రివర్గంలో ముగ్గురు భారతీయులకు మరలా అవకాశం కల్పించారు. ఫలితంగా ప్రీతి పటేల్, అలోక్​ శర్మ, రిషి సునక్ తమ పదవులను నిలుపుకున్నారు.​

Priti Patel, Alok Sharma, Rishi Sunak in Boris Johnson's ‘People's Cabinet'
బోరిస్ కేబినెట్​లో ముగ్గురు భారతీయ సంతతి మంత్రులు

బోరిస్ కేబినెట్​లో ముగ్గురు భారత సంతతి మంత్రులు

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పీపుల్స్ కేబినెట్​లో భారతీయ సంతతి సభ్యులు ప్రీతి పటేల్​, అలోక్​ శర్మ, రిషి సునక్​ తమ పదవులను నిలుపుకున్నారు.

బ్రెగ్జిట్ ప్రధాన అంశంగా జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్ నేతృత్వంలోని కన్జర్వేటివ్​ పార్టీ 80 సీట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. కాగా కొత్తగా ఎన్నికైన సభ్యులు మంగళవారం మొదటి పార్లమెంట్ సమావేశానికి హాజరయ్యారు.

బోరిస్ కేబినెట్​లో.. బ్రిటన్​ హోంశాఖ కార్యదర్శిగా ప్రీతి పటేల్​ మరోమారు తన స్థానాన్ని నిలుపుకున్నారు. అలోక్​ శర్మ అంతర్జాతీయ అభివృద్ధిశాఖ బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్​ ట్రెజరీ చీఫ్​ సెక్రటరీగా తన పదవిని నిలబెట్టుకున్నారు. ఈయన గత ప్రభుత్వంలో యూకే పాక్ సంతతి ఛాన్సలర్ సాజిద్ జావిద్​తో కలిసి పనిచేశారు.

Last Updated : Dec 18, 2019, 10:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details