తెలంగాణ

telangana

ETV Bharat / international

అదరగొట్టిన ఎలక్ట్రిక్ ఇంజిన్​ స్పోర్ట్స్ కార్లు

పోలెండ్​లోని పోజ్​నాన్​ నగరంలో జరుగుతున్న మోటర్​ షో కార్యక్రమం వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా డ్రైవర్​ రహిత విద్యుత్​​ వాహనాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

By

Published : Mar 30, 2019, 5:42 PM IST

పోలెండ్​ మోటర్​ షో కార్యక్రమం

పోలెండ్​ మోటర్​ షో కార్యక్రమం
మీకు సరికొత్త స్పోర్ట్స్​కార్లు, అధునాతన వాహనాలంటే అమితమైన ప్రేముందా... అలాంటి కార్లను వెంటనే చూసేయాలనుందా... అయితే పోలెండ్​లోని పోజ్​నాన్​ నగరానికి వెళ్లాల్సిందే... పోజ్​నాన్​ నగరంలో జరుగుతున్న మోటర్​ షో కార్యక్రమం వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఆడీ, ఫోక్స్​ వాగన్​ తదితర దిగ్గజ కార్ల తయారీ సంస్థలు రూపొందించిన అధునాతన ఎలక్ట్రిక్ ​కార్లు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్రైవర్​ ప్రమేయం లేకుండా నడిచే ఎలక్ట్రిక్​ వాహనాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

ఆడీ సరికొత్త సాంకేతికతతో రూపొందించిన స్పోర్ట్స్​కారు, జర్మనీకి చెందిన ఫోక్స్​ వాగన్ సంస్థ​ 'బజ్​ అటానామస్​ సాంకేతిక పరిజ్ఞానం' సాయం​తో తయారుచేసిన మైక్రోబస్​ (వెనగాన్​)ను ప్రదర్శనలో ఉంచింది. పూర్తిగా ఎలక్ట్రిక్​ ఇంజిన్​తో కూడిన ఈ వెనగాన్​ డ్రైవర్​ ప్రమేయం లేకుండానే నడుస్తుంది. వీటితో పాటు ఈ ఏడాది మోటార్​ షో కార్యక్రమంలో 60 నూతన కార్లను మొదటిసారిగా ప్రదర్శనలో ఉంచారు.

" ఇక్కడి ప్రధానాంశం ఏంటంటే... ఈ ఎలక్ట్రిక్​ కారు చాలా బాగుంది. నడిపేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చాలా వేగంగా వెళ్లగలదు. 300 హార్స్​ పవర్స్​ కలిగిన రెండు ఇంజిన్లు ఈ కారులో ఉంటాయి. అందుకే కారు వేగం ఎక్కడా తగ్గదు. కారు మొదలైనప్పటి నుంచి వీలైనంత వేగంతో ప్రయాణించొచ్చు. అందుకే కారు నడుపుతుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. పొగ విడుదల చేసే కార్లతే పోలిస్తే ఇవి శబ్దం లేకుండా ప్రయాణిస్తాయి. నేను ఇంత వరకు ఇలాంటి ప్రత్యేకతలున్న కారును చూడలేదు."
- తోమాస్​​ టోండర్​, ఫోక్స్​ వాగెన్​ సంస్థ అధికార ప్రతినిధి

ఈనెల 29న ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటితో ముగియనుంది. దాదాపు లక్షా 50 వేల మంది వీక్షకులు హాజరయ్యే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details