తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2021, 11:02 PM IST

ETV Bharat / international

ఇటలీ ప్రధానితో మోదీ భేటీ- ద్వైపాక్షిక అంశాలపై చర్చ!

ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi Italy Visit)... ఆ దేశ ప్రధాని మారియో డ్రాగీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Modi Italy Visit
ఇటలీ ప్రధానితో మోదీ భేటీ

ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi Italy Visit).. ఆ దేశ ప్రధానమంత్రి మారియో డ్రాగితో తొలిసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇటలీ పర్యటనలో మోదీ
మారియో డ్రాగితో మోదీ

శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో(G20 Summit 2021) పాల్గొనేందుకు ఇటలీ పర్యటన చేపట్టారు ప్రధాని. శనివారం ఉదయం ఇటలీ చేరుకున్న ఆయనకు రోమ్​లోని ఇటలీ ప్రధానమంత్రి కార్యాలయం ప్లాజో చిగిలో డ్రాగి స్వాగతం పలికారు. అక్కడ మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

ఇటలీ ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీ
గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని మోదీ

జీ20 సమావేశం అనంతరం బ్రిటన్​లోని గ్లాస్గోలో జరగనున్న కాప్26 ప్రపంచ నేతల సదస్సులోనూ మోదీ పాల్గొనున్నారు.

ఇదీ చూడండి:ఇటలీలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం

ABOUT THE AUTHOR

...view details