తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచమంతా క్రిస్మస్​ సంబరాలు.. ఫిలిప్పీన్స్​లో తుపాను - ఫిలిప్పీన్స్​లో తుపాను

ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా బుధవారం ప్రపంచ దేశాల్లో క్రిస్మస్​ వేడుకలు అట్టహాసంగా సాగాయి. క్రైస్తవ ఆధ్యాత్మిక పెద్దలు శాంతి సందేశాలు అందించారు. అయితే.. తుపానుతో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్​, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఫ్రాన్స్​ దేశాల్లో పలు చోట్ల క్రిస్మస్​కు దూరంగా ఉన్నారు.

Christmas
ప్రపంచమంతా క్రిస్మస్​ సంబరాలు

By

Published : Dec 26, 2019, 5:31 AM IST

Updated : Dec 26, 2019, 7:10 AM IST

ప్రపంచమంతా క్రిస్మస్​ సంబరాలు.. ఫిలిప్పీన్స్​లో తుపాను

ప్రపంచ దేశాలు బుధవారం క్రిస్మస్​ సంబరాల్లో మునిగితేలాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చర్చిల్లో ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. మిఠాయిలు పంచుకున్నారు. ఆయా దేశాల్లో క్రైస్తవ ఆధ్యాత్మిక పెద్దలు శాంతి సందేశాలు అందించారు. అయితే.. ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్​ దేశాల్లో క్రిస్మస్​ సందడి కనిపించలేదు. తుపాను ధాటికి ఫిలిప్పీన్స్​ జనజీవనం అతలాకుతలమైంది. ఫ్రాన్స్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.

ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం..

ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం సృష్టించింది. ప్రచండగాలులతో కురుస్తున్న వర్షాలకు భారీ వృక్షాలు నేలకూలాయి. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో ఈ ఏడాది క్రిస్మస్​ వేడుకలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని చర్చిల్లో క్రిస్మస్​ వాతావరణం కనిపించలేదు.

ఆందోళనతో ఫ్రాన్స్​..

ఫ్రాన్స్​లో ఈ ఏడాది చాలా మంది క్రిస్మస్​కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం పింఛను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలకు వ్యతిరేకంగా చేస్తోన్న సమ్మె నాలుగో వారానికి చేరుకుంది. ఈ కారణంగా చాలా మంది ప్రజలు.. కుటుంబం, స్నేహితులతో కలిసి క్రిస్మస్​ వేడుకలు చేసుకోవాలన్న ప్రణాళికలు వ్యర్థమయ్యాయి.

సూడాన్​ ప్రజలకు పోప్​ శాంతి సందేశం..

ఆఫ్రికన్​ దేశాలు, తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చలు విఫలమైన క్రమంలో పోప్​ ఫ్రాన్సిస్​, కాంటర్బరీ ఆర్చ్​ బిషప్​ జస్టిన్​ వెల్బీ.. దక్షిణ సూడాన్​కు శాంతి సందేశాలు అందించారు. సూడాన్​లో ప్రజల మధ్య సయోధ్య, సోదరభావం కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు 1.3 బిలియన్లకుపైగా ఉన్న క్రైస్తవ ఆధ్యాత్మిక గురువులు.

కొలరాడోలో వింత అనుభవం..

అమెరికా కొలరాడో రాష్ట్రంలో క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్నవారిని ఓ దొంగ ఆశ్చర్యానికి గురిచేశాడు. గత సోమవారం కొలరాడో స్ప్రింగ్స్​లోని ఓ బ్యాంకులో దొంగతనం చేసిన వ్యక్తి ఆ నగదును మొత్తం గాల్లోకి విసిరేశాడు, మేరీ క్రిస్మస్​ అంటూ నినాదాలు చేశాడు. ప్రజలు వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: 'చైనా తుపాకుల కన్నా మా సత్యమే శక్తిమంతం'

Last Updated : Dec 26, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details