భూమిపై మానవ మనుగడకు అత్యంత ప్రధానమైనవి చెట్లు. కానీ, మనుషుల విపరీత చర్యల వల్ల ఆ వృక్ష సంపదే(Tree Species).. కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. ప్రపంచంలో ఉన్న మొత్తం వృక్షజాతుల్లో మూడింట ఒకవంతు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం.. గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ సంస్థ(Global Tree Assessment) రూపొందించిన ఓ నివేదికలో వెల్లడైంది. భూమిపై ఉన్న చెట్లపై.. అధ్యయనం చేసి, తయారు చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం.
మంగోలియాస్, ఓక్స్, మేపుల్స్ వంటి వృక్షాలకు కూడా అంతరించిపోయే ముప్పు ఉన్నట్లు ఈ నివేదికలో తేలింది. 400కుపైగా వృక్ష జాతుల్లో.. ఆ చెట్ల సంఖ్య 50 కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మరోవైపు.. ఇప్పటికే 142 వక్ష జాతులు(Tree Species) అంతరించిపోయాయి. వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం, కలప కోసం చెట్లను నరకడం వంటి మానవ చర్యలు సహా తెగుళ్లు, వ్యాధులు వంటివి సోకడం కారణంగా చెట్లు అంతరిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ఎలా అధ్యయనం చేశారు..