కరోనా బారిన పడి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు సేవలందించిన నర్సు తన అనుభవాలను పంచుకున్నారు. కరోనా వైరస్ సోకి అనారోగ్యం పాలైన బోరిస్.. వారం రోజులపాటు లండన్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఆయనకు సేవలందించేందుకు ఇద్దరు నర్సులను కేటాయించారు. వీరిలో ఒకరు.. పోర్చుగల్కు చెందిన లూయీ పీతర్మ. థామస్ ఆసుపత్రిలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు.
గొప్ప అవకాశం..
ప్రధానికి ఆరోగ్య సిబ్బందిగా తనను ఎంపిక చేశారని తెలియగానే భయమేసిందని ఆమె తెలిపారు. ప్రధానికి 3 రోజుల పాటు సేవలందించడం తనకు దక్కిన గొప్ప అవకాశమని ఆమె అన్నారు.