తెలంగాణ

telangana

By

Published : May 30, 2019, 6:55 AM IST

Updated : May 30, 2019, 7:38 AM IST

ETV Bharat / international

నేడు లండన్​ కోర్టులో హాజరుకానున్న నీరవ్​

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నేడు లండన్ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. రూ.14 వేల కోట్ల మేర భారత బ్యాంకులను మోసగించిన కేసులో ఆయనను భారత్​కు అప్పగింతపై న్యాయస్థానం విచారణ జరపనుంది.

నేడు లండన్​ కోర్టులో హాజరుకానున్న నీరవ్​

రూ.14 వేల కోట్ల మేర భారత బ్యాంకులను మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్​ మోదీ.. నేడు లండన్​ కోర్టులో హాజరుకానున్నారు. ఆయనను భారత్​కు అప్పగించే అంశంపై న్యాయస్థానం విచారణ జరపనుంది. ప్రస్తుతం వాండ్స్​వర్త్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.

నీరవ్ మూడో బెయిల్ పిటిషన్​ను ఈనెల మొదట్లోనే తిరస్కరించింది లండన్ న్యాయస్థానం. సెక్యూరిటీ డిపాజిట్​ను 2 మిలియన్​ పౌండ్ల డాలర్లకు పెంచేందుకు సిద్ధమని నీరవ్​ తెలిపినా బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. ఆర్థిక నేరం కేసులో నీరవ్ లొంగిపోతారని తాము విశ్వసించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: నేడు మరోసారి ఈడీ ఎదుట విచారణకు వాద్రా...

Last Updated : May 30, 2019, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details