తెలంగాణ

telangana

కరోనా, సాధారణ జలుబు మధ్య తేడా ఇదే...

By

Published : Aug 20, 2020, 4:26 PM IST

Updated : Aug 20, 2020, 6:50 PM IST

జలుబు వల్ల రుచి, వాసన లక్షణాలను కోల్పోవడం సర్వ సాధారణం. కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో చిన్నపాటి జలుబు వచ్చినా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో రుచి, వాసన లక్షణాల ఆధారంగా కరోనా బాధితులు.. జలుబుతో తీవ్రంగా సతమతమవుతున్న వారి మధ్య వ్యత్యాసాన్ని కనుగొంది ఐరోపాకు చెందిన ఓ బృందం. కరోనా బాధితుల్లో వాసన లక్షణం కోల్పోయినప్పటికీ.. వారికి ఊపిరి తీసుకోవడంలో పెద్ద ఇబ్బందులు ఉండటం లేదని, ముక్కు కారడం వంటివి లేవని పేర్కొంది.

New research shows how COVID-19 smell loss differs from the common cold
కరోనాకు జలుబుకు మధ్య వ్యత్యాసమిదే!

చిన్నపాటి దగ్గు, తుమ్ము వచ్చినా బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఇక జ్వరం, జలుబు వచ్చి, వాసన గుర్తించే శక్తి కోల్పోతే.. కరోనా భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీజనల్​ వ్యాధులకు, కరోనా వైరస్​కు ఒకే రకమైన లక్షణాలుండటం ఇందుకు ప్రధాన కారణం. ఈ సమయంలో ప్రజలకు ఊరట కలిగిస్తూ.. సాధారణ జలుబు వల్ల వాసన సామర్థ్యాన్ని కోల్పోవడానికి.. కరోనా వైరస్​ లక్షణాలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించింది ఐరోపాకు చెందిన ఓ నిపుణుల బృందం.

"కంపేరింగ్​ కొవిడ్​-19 అండ్​ కామన్​ కోల్డ్​ కీమోసెన్సరీ డిస్​ఫంక్షన్​" పేరుతో ఉన్న ఈ అధ్యయనం రినోలజీ జర్నల్​లో ప్రచురితమైంది. అప్పర్​ రెస్పిరేటరీ ట్రాక్ట్​ ఇన్​ఫెక్షన్​ వల్ల కరోనా బాధితులు.. ఏ విధంగా వాసన, రుచి చూసే సామర్థ్యాన్ని కోల్పోతారనే అంశాన్ని ఇతరుల పరిస్థితితో పోల్చి చూశారు వాసన రుగ్మత నిపుణులు.

కరోనా బాధితుల్లో వాసన చూసే శక్తి పోయినప్పటికీ... వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. ముక్కు కారడం కూడా ఉండదు. తీపి, చేదు రుచిని గుర్తించలేరు. ఇదే వారు కనుగొన్న ముఖ్య వ్యత్యాసం. మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుందని చెబుతున్న పలు అధ్యయనాలకు ఈ పరిశోధన ఊతమందిస్తోంది. దీంతో.. రుచి, వాసన లక్షణాల ఆధారంగా కరోనా పరీక్షల నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పరిశోధక బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

పరిశోధన కోసం 10 మంది కరోనా బాధితులు, జలుబుతో తీవ్రంగా సతమతమవుతున్న 10 మంది, 10 మంది ఆరోగ్యవంతులపై పరీక్షలు నిర్వహించారు.

"వాసన కోల్పోయే లక్షణం కరోనా బాధితుల్లో ఎక్కువగా ఉన్నట్టు మేము గుర్తించాం. వాసనను గుర్తుపట్టడంలో బాధితులు చాలా కష్టపడ్డారు. ఇదే వీరికీ.. జలుబుతో ఉన్న వారికీ మధ్య ఉన్న అతిపెద్ద వ్యాత్యాసం. కరోనా బాధితులు- జలుబు, ఫ్లూతో బాధపడుతున్న వారిని వేరు చేయడానికి.. రుచి, వాసన లక్షణాల ఆధారంగా పరీక్షలు నిర్వహించవచ్చు."

--- ఫిల్​పొట్​, పరిశోధకులు

ఇదీ చూడండి:-టాయిలెట్​లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే...

Last Updated : Aug 20, 2020, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details