లండన్లో ఉగ్రదాడికి తెగించాడు ఓ ముష్కరుడు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ అగంతకుడు లండన్ వంతెన వద్ద కత్తితో దాడిచేసి పలువురిని గాయపరిచాడు. నకిలీ బాంబు చొక్కా వేసుకుని అందరినీ బెదిరించాడు. ప్రజలు భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం స్పందించి ముష్కరుని హతమార్చారు. అయితేవంతెనపై జరిగిన ఘటనను ఉగ్రదాడిగా స్కాట్లాండ్ యార్డ్ అధికారులు ప్రకటించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఉగ్రదాడిలో ఎంతమంది గాయపడ్డారో అధికారులు ఇంకా నిర్థరించలేదు.
ట్రాఫిక్ బంద్..
ఉగ్రదాడి నేపథ్యంలో వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సమీపంలోకి కార్యాలయాలు, భవనాలు మూతపడ్డాయి. లండన్ బ్రిడ్జ్ రైల్వేస్టేషన్ను ముందుజాగ్రత్తగా మూసివేశారు.