తెలంగాణ

telangana

ETV Bharat / international

లండన్​లో ఉగ్రదాడికి యత్నం.. ముష్కరుడు హతం - ఉగ్రవాది హతమార్చిన లండన్ పోలీసులు

లండన్​ బ్రిడ్జ్​పై ఓ అగంతకుడు కత్తితో దాడులకు పాల్పడిన ఘటనను అధికారులు ఉగ్రదాడిగా ప్రకటించారు. ముష్కరుడిని ఘటనా స్థలంలోనే హతమార్చినట్లు స్పష్టం చేశారు. ఘటనపై స్పందించిన ప్రధాని బోరిస్ జాన్సన్​ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు.

London Bridge attack declared terrorist incident
లండన్ బ్రిడ్జ్ ఘటన ఉగ్రదాడే.. స్కాట్​లాండ్ యార్డ్ ప్రకటన

By

Published : Nov 30, 2019, 12:04 AM IST

లండన్​లో ఉగ్రదాడికి తెగించాడు ఓ ముష్కరుడు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ అగంతకుడు లండన్​ వంతెన వద్ద కత్తితో దాడిచేసి పలువురిని గాయపరిచాడు. నకిలీ బాంబు చొక్కా వేసుకుని అందరినీ బెదిరించాడు. ప్రజలు భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం స్పందించి ముష్కరుని హతమార్చారు. అయితేవంతెనపై జరిగిన ఘటనను ఉగ్రదాడిగా స్కాట్​లాండ్ యార్డ్ అధికారులు ప్రకటించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఉగ్రదాడిలో ఎంతమంది గాయపడ్డారో అధికారులు ఇంకా నిర్థరించలేదు.

ట్రాఫిక్ బంద్​..

ఉగ్రదాడి నేపథ్యంలో వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సమీపంలోకి కార్యాలయాలు, భవనాలు మూతపడ్డాయి. లండన్ బ్రిడ్జ్ రైల్వేస్టేషన్​ను ముందుజాగ్రత్తగా మూసివేశారు.

ఎన్నికల ప్రచారం మధ్యలో..

ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని బోరిస్​ జాన్సన్​.. ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు. డౌనింగ్​ స్ట్రీట్​కు వచ్చిన ఆయన ఉగ్రవాద ఘటనపై అధికారులతో చర్చించారు. ఉగ్రదాడిని ఖండించారు. సకాలంలో స్పందించిన పోలీసులను అభినందించారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు.

ఐసిస్​ దాడి

2017 జూన్​లో ఐసిస్ ఉగ్రవాదులు ఇదే లండన్​ బ్రిడ్జ్​పై... వ్యాన్​తో ఢీకొని 11 మంది సామాన్య ప్రజల ప్రాణాలు బలిగొన్నారు. గత నెలలో బ్రిటన్​ ప్రభుత్వం.. దేశంలో ఉగ్రవాద ముప్పు.. తీవ్రమైన నుంచి గణనీయమైన స్థాయికి చేరిందని ప్రకటించింది. అంటే దేశంలో ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉండే అవకాశముందని తెలుస్తోంది.

ఇదీ చూడండి: రేపే ఝార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు


ABOUT THE AUTHOR

...view details