కరోనా వైరస్ వ్యాప్తితో పలు దేశాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా వారంపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ప్రభుత్వ రవాణా సౌకర్యాలను బంద్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వైరస్ను కట్టడి చేయడానికి మార్కెట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. లాక్డౌన్ భయంతో దేశ రాజధాని ఢాకాను వేలమంది వదిలివెళ్లిపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై చిన్న వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. వైరస్ను నియంత్రించడానికి సహకరించాలని ప్రజలను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కోరారు.
బంగ్లాదేశ్లో 7,087 కొత్త కోసులు తాజాగా వెలుగుచూశాయి. 53 కొవిడ్ మరణాలు సంభవించాయి.
ఫిలిప్పీన్స్లో లాక్డౌన్ పొడగింపు..
కరోనా వ్యాప్తితో ఫిలిప్పీన్స్లో లాక్డౌన్ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ విధించి వారం దాటినా వైరస్ వ్యాప్తిలో ఏ మార్పు లేకపోవటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఐసీయూల్లో పరిమితికి మించి రోగులు చికిత్స పొందుతున్నారు. రోమన్ క్యాథలిక్లు ఈస్టర్ వేడుకలను ఆన్లైన్లోనే జరుపుకున్నారు.