తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2020, 11:19 PM IST

Updated : Mar 8, 2020, 7:29 AM IST

ETV Bharat / international

ఇటలీలో 200కు చేరిన కరోనా మృతులు

కరోనా వైరస్​తో ఇటలీ విలవిలలాడుతోంది. వైరస్​ ధాటికి మృతుల సంఖ్య 200కు చేరింది. చైనా అనంతరం అధిక మరణాలు ఇటలీలోనే సంభవించాయి.

Italy coronavirus toll passes 200, cases near 6,000
ఇటలీలో 200కు చేరిన కరోనా మృతులు

ఇటలీలో కరోనా వైరస్​ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. వైరస్​ ధాటికి ఇప్పటివరకు 200 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మరో 6వేల మంది వైరస్​ బారిన పడినట్టు స్పష్టం చేశారు.

ఇటలీలోని లాజియో ప్రాంతం గవర్నర్​ నికోలా జింగరెట్ట్​కు వైరస్​ లక్షణాలున్నట్టు తేలడం స్థానికులను తీవ్ర కలవరపరిచింది. అయితే తనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆయన చెప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఇటలీ ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకరి నుంచి మరొకరు కనీసం ఒక మీటర్​ దూరం అయినా ఉండాలని స్పష్టం చేసింది. దీనిని ఆ దేశంలోని అనేకమంది పాటించడం ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా...

ఇటలీతో పాటు అనేక దేశాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇరాన్​లో 145 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలో రెండో మరణం నమోదైంది.

మరోవైపు.. మస్లింల పవిత్ర ప్రాంతమైన మక్కాలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. మసీదులోని పవిత్ర కాబకు పరిసర ప్రాంతాలను సౌదీ ఆరేబియా ప్రభుత్వం శనివారం తెరిచింది. పర్యటకులు లేక శుక్రవారం వెలవెలబోయిన ఆ ప్రాంతం.. శనివారం వందలాది యాత్రికులతో శోభిల్లింది.

Last Updated : Mar 8, 2020, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details