తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2021, 7:52 AM IST

ETV Bharat / international

సామాజిక మాధ్యమాలను వీడనున్న హ్యారీ దంపతులు

ప్రిన్స్​ హ్యారీ అతని భార్య మేఘాన్​ మెర్కెల్​లు సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాలను ముగించనున్నారు. తమ ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకుంటున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు.

harry couple leaving social media
సామాజిక మాధ్యమాల్ని వీడనున్న హ్యారీ దంపతులు

బ్రిటన్​ రాచరికపు హోదాను వదులుకుని సంచలనం సృష్టించిన ప్రిన్స్​ హ్యారీ, అతని భార్య మేఘాన్​ మెర్కెల్​లు తాజాగా తమ సామాజిక మాధ్యమ ఖాతాలనూ ముగించాలని నిర్ణయించుకున్నారు. ట్విటర్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో వీరికి మంచి ఫాలోయింగ్​ ఉంది.

@ససెక్​రాయల్​ పేరిట ఉన్న ఈ దంపతుల ఇన్​స్టాగ్రామ్​ ఖాతాకు కోటికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. వీరిని అనుసరించే వాళ్లు ఉన్నట్టే, విమర్శించే వాళ్లకూ సోషల్​ మీడియాలో కొదువలేదు. పెళ్లికి ముందు నటిగా ఉన్న తనపై ఇప్పటికీ ట్రోలింగ్​ జరుగుతోందని మేఘాన్​ మెర్కెట్​ ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. అదీకాక ఇకపై వ్యక్తిగత హోదాల్లో అమెరికా వెళ్లి తమ ఇష్టమైన రంగాల్లో రాణించానుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రారంభించిన ఖాతాలన్నీ వీడాలనుకుంటున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు.

ఇదీ చదవండి:నేడు దిగువ సభలో ట్రంప్​పై అభిశంసన తీర్మానం

ABOUT THE AUTHOR

...view details