తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్రెటా థన్​బర్గ్​కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి'

పర్యావరణ పరిరక్షణకై అవిశ్రాంత పోరాటం చేస్తున్న గ్రెటా థన్​బర్గ్​ను 'అంతర్జాతీయ బాలల శాంతి​' పురస్కారం వరించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు కదిలి వచ్చేలా చేసినందుకు ఈ అవార్డు దక్కింది.

By

Published : Nov 22, 2019, 5:16 AM IST

Updated : Nov 22, 2019, 7:47 AM IST

గ్రెటా థన్​బర్గ్​కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి'

స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి' వరించింది. పర్యావరణ పరిరక్షణకై థన్​బర్గ్​ చేస్తున్న పోరాటానికి ఈ అవార్డు లభించింది.

స్పెయిన్​లో జరగనున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనడానికి పయనమైన థన్​బర్గ్​... ఈ అవార్డును స్వయంగా స్వీకరించలేకపోయారు. కానీ అవార్డు దక్కడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. థన్​బర్గ్​కు బదులుగా ఈ బహుమతిని జర్మన్​కు చెందిన పర్యావరణవేత్త లూయిసా మేరీ అందుకున్నారు.

థన్​బర్గ్​తో పాటు ఆఫ్రికాలోని కామెరూన్​ దేశానికి చెందిన 15ఏళ్ల దివినా మాలౌమ్​కు కూడా ఈ అవార్డు దక్కింది. డచ్​కు చెందిన బాలల హక్కుల సంస్థ 2005 నుంచి ఈ అవార్డును అందిస్తోంది.

'స్కూల్ స్ట్రైక్స్​ ఫర్​ ది క్లైమెట్​' ఉద్యమంతో ఎంతో ప్రసిద్ధి చెందారు థన్​బర్గ్​. ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది చిన్నారులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'పదవికి రాజీనామా చేసి పార్టీ మారటమే రాజ మార్గం'

Last Updated : Nov 22, 2019, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details