తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2019, 5:17 PM IST

Updated : Sep 28, 2019, 5:34 AM IST

ETV Bharat / international

జీ7 సదస్సు: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై చర్చ

ప్రపంచంపై ఆర్థిక మాంద్యం కోరలు చాచిన వేళ ఫ్రెంచ్‌ తీర ప్రాంత నగరం బియారిట్జ్‌లో జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్​ సహా అగ్రదేశాధినేతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై ప్రధానంగా చర్చిస్తున్నారు.

జీ7 సదస్సు: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై చర్చ

జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. అగ్రదేశాధినేతల భేటీకి ఫ్రెంచ్​ తీరప్రాంత నగరం బియారిట్జ్​ వేదికైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​తో పాటు​, ఇటలీ, కెనడా, జర్మనీ, జపాన్​ దేశాధినేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా.. క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లఘించిందని జపాన్​ ప్రధాని షింజో అబే మిత్ర దేశాలకు తెలిపారు.

అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టివేస్తాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ ఇదివరకే హెచ్చరించారు. ఆర్థిక పురోగతికి వాణిజ్య ఒప్పందాలు బాటలు వేస్తాయని జీ 7 దేశాలకు సూచించారు. ఈ నేపథ్యంలో పలు దేశాధినేతలు ప్రత్యేక భేటీల్లో పాల్గొన్నారు.

జీ7 సదస్సు: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై చర్చ

ట్రంప్​-బోరిస్​ భేటీ

బ్రెగ్జిట్ తర్వాత అమెరికాతో కుదుర్చుకోవాల్సిన వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు ట్రంప్​తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు బోరిస్​. ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య సమస్యలను తొలగించేందుకు వర్కింగ్​ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

జపాన్​తో ఒప్పందాలకు వేళైంది

జీ7లో భాగంగా జపాన్​ ప్రధాని షింజో అబే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అతి త్వరలోనే జపాన్​తో ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్​ తెలిపారు.

ఇరాన్​, ఉత్తర కొరియా దేశాలతో అమెరికా, జపాన్​ సత్సంబంధాలపైనా ఇరువురు నేతలు చర్చించారు.

Last Updated : Sep 28, 2019, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details