తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్' భారత్​-పాక్​ల ద్వైపాక్షిక అంశమే: ఫ్రాన్స్​​

జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ రద్దుపై ఫ్రాన్స్​ స్పందించింది. కశ్మీర్..​ భారత్​-పాక్​ల ద్వైపాక్షిక అంశమని పేర్కొంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ ఆర్టికల్​ 370 రద్దు భారత్​ అంతర్గత విషయమని స్పష్టం చేసింది బంగ్లాదేశ్​.

By

Published : Aug 21, 2019, 7:50 PM IST

Updated : Sep 27, 2019, 7:39 PM IST

'కశ్మీర్' భారత్​-పాక్​ల ద్వైపాక్షిక అంశమే: ఫ్రాన్స్​​


కశ్మీర్​ అంశం భారత్​-పాకిస్థాన్​ల ద్వైపాక్షిక అంశమేనని పేర్కొంది ఫ్రాన్స్​. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరింది.

ఆపరేషన్​ కశ్మీర్​పై సాయం కోసం పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి మహమ్మూద్​ ఖురేషీ... ఫ్రాన్స్​ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియాన్స్​తో మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కశ్మీర్​పై ఈ వ్యాఖ్యలు చేశారు డ్రియాన్స్​. కశ్మీర్​పై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. కశ్మీర్​ అంశం ఇరుదేశాలకు సంబంధించినదిగానే చూస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
కశ్మీర్​ అంశం పూర్తిగా అంతర్గత వ్యవహారమన్నది భారత్​ వాదన. ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్​ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బంగ్లాదేశ్ మాత్రం...

అధికరణ 370 రద్దు భారత్​ అంతర్గత విషయమని స్పష్టం చేసింది పొరుగు దేశం బంగ్లాదేశ్​. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి అనేవి అన్ని దేశాల ముందున్న ప్రాధాన్య అంశాలని తెలిపింది.
బంగ్లాదేశ్​లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ పర్యటన ముగిసిన మరుసటి రోజునే ఈ వ్యాఖ్యలు చేసింది.


ఇదీ చూడండి : 'భాజపా సభ్యత్వ నమోదు సూపర్​ హిట్​!'

Last Updated : Sep 27, 2019, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details