తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2019, 4:21 PM IST

ETV Bharat / international

అందాలు చూపిన డేగ.. అపాయం గుర్తు చేసింది!

మూడో కంటితో ఆ పక్షి ఎన్నో సుందర దృశ్యాలు చూపించింది. అదే సమయంలో భూమికి పొంచి ఉన్న ప్రమాదాన్ని కళ్లకు కట్టి మరీ హెచ్చరించింది. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.

అందాలు చూపిన డేగ.. అపాయం గుర్తు చేసింది!


ఐరోపా​ ఆల్ప్​ పర్వతాల్లో డేగకు అమర్చిన కెమెరా వాతావరణంలో మార్పు, భూతాపం​ వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని కళ్లకు కట్టింది.

అందాలు చూపిన డేగ.. అపాయం గుర్తు చేసింది!

విక్టర్​ అనే డేగ ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తుందో తెలుసుకునేందుకు దాని రెక్కల నడుమ ఓ కెమెరా అమర్చారు పరిశోధకులు. పక్షులు ఎలాంటి ప్రకృతిని ఇష్టపడతాయో తెలుసుకునే ప్రయత్నంలో ఓ చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ఆల్ప్​ పర్వతాల్లో విహరించిన ఆ పక్షి కళ్లతో చూసిన దృశ్యాలు ఎంత మనోహరంగా ఉన్నాయో, అవి కనుమరుగైపోతాయన్న వాస్తవం అంత కఠినంగా ఉంది.

ఒకప్పటి అద్భుతమైన హిమ పర్వతాలు.. ఇప్పుడు కరిగిపోతున్నట్లు, అసహజంగా మారుతున్నట్లు విక్టర్​ కెమెరా ద్వారా తెలిసింది.
వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి సుందర ప్రదేశాలు అస్థిత్వాన్ని కోల్పోవడమే కాదు... వనాలు వాడిపోయి, నీరు ఇంకిపోయి, మానవ జీవనం అగమ్యగోచరంగా మారుతుంది. డేగ మూడో కంటితో చూపించిన ఈ దృశ్యాలు ప్రకృతిని, పక్షులనూ కాపాడుకునేందుకు సత్వర చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తునట్టున్నాయి .

ఇదీ చూడండి:'ప్లాస్టిక్'​ పసుపుతో మంచి ఆరోగ్యం, ఆదాయం!

ABOUT THE AUTHOR

...view details