తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2019, 5:48 PM IST

Updated : Oct 17, 2019, 7:32 PM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​ను పూర్తి చేసే దిశగా బోరిస్ జాన్సన్​..!

బ్రెగ్జిట్​ కొత్త ఒప్పందాన్ని బ్రిటన్​, ఐరోపా సమాఖ్య ప్రతినిధుల బృందాలు అంగీకరించాయని యూకే ప్రధాని బోరిస్​ జాన్సన్​ తెలిపారు. ఈ ఒప్పందంపై ప్రశంసలు కురిపించిన ఈయూ అధ్యక్షుడు జీన్​ క్లాడర్​.. బ్రస్సెల్స్​ భేటీలో ఆమోదం లభించాలని ఆకాంక్షించారు.

EU leaders welcome outline Brexit deal

బ్రెగ్జిట్​ను పూర్తి చేసే దిశగా బోరిస్ జాన్సన్

బ్రెగ్జిట్​ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒప్పందం ఆమోదించుకునే దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఇందుకోసం పలు మార్పులు చేసి కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించారు జాన్సన్​.

బ్రస్సెల్స్​లో ఐరోపా నేతల సమావేశానికి ముందుగా బ్రెగ్జిట్​ ఒప్పందానికి ఈయూ ప్రతినిధుల బృందం ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. మంచి ఒప్పందం కోసం బ్రిటన్​, ఐరోపా సమాఖ్య ప్రతినిధులు కష్టపడుతున్నారని జాన్సన్​ అన్నారు. అయితే దీనికి ఇంకా బ్రిటన్​, ఐరోపా చట్ట సభలు ఆమోదం తెలపాల్సి ఉందని పేర్కొన్నారు.

"మనకు ఒక కొత్త ఒప్పందం కుదిరింది. ఇది పరిస్థితులను తిరిగి నియంత్రణలోకి తెస్తుంది. ఇప్పుడు దీనికి పార్లమెంటు శనివారం ఆమోద ముద్ర వేయాలి. ఆ తర్వాత ఇతర ముఖ్యాంశాలైన జీవన వ్యయం, నేరాలు, పర్యావరణం, జాతీయ భద్రతపై దృష్టిపెట్టవచ్చు."

-బోరిస్ జాన్సన్​, బ్రిటన్ ప్రధాని

సానుకూలంగా ఈయూ

బ్రిటన్​ ప్రతిపాదిత కొత్త ఒప్పందాన్ని ఐరోపా కమిషన్​ అధ్యక్షుడు జీన్​ క్లాడ్​ జంకర్​ ప్రశంసించారు. వచ్చే గురువారం బ్రస్సెల్స్​లో జరిగే సమావేశంలో ఐరోపా నేతలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని సూచించారు.

"ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఒప్పందం ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు మనకు లభించింది. ఈ ఒప్పందం బాగుంది. అందరి ఆకాంక్షలకు తగినట్లు ఉంది. ఇది పరిష్కార మార్గాలను కనుగొనే ఓ వీలునామా. ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. "

-జీన్​ క్లాడ్​ జంకర్​, ఐరోపా కమిషన్​ అధ్యక్షుడు

రెండు రోజుల చర్చలు..

అక్టోబర్​ 31 లోపు ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగాల్సి ఉంది. ఈ సమయంలోగా ఒప్పందాన్ని ఆమోదించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు జాన్సన్.

ఇందుకోసం బ్రిటన్​ విదేశాంగ మంత్రి స్టీఫెన్​ బార్క్​లే నేతృత్వంలోని బ్రెగ్జిట్​ బృందంతో మైకేల్​ బర్నియర్​ నేతృత్వంలోని ఈయూ ప్రతినిధుల బృందం రెండు రోజుల పాటు చర్చించింది. సమాఖ్యలోని 28 దేశాలు ఆమోదించే విధంగా ఒప్పందంలో పలు అంశాలను తొలగించారు.

అయితే ఈయూలోని ఐర్లాండ్​, బ్రిటన్​ అధీనంలోని ఉత్తర ఐర్లాండ్​లో కస్టమ్స్, పన్ను విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇదీ చూడండి: 'ఇది కార్యశక్తి.. స్వార్థశక్తికి మధ్య జరిగే పోరు'

Last Updated : Oct 17, 2019, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details