తెలంగాణ

telangana

ETV Bharat / international

ఏథెన్స్​లో భూకంపం- 4కి.మీ ట్రాఫిక్ జామ్​

గ్రీస్​ రాజధాని ఏథెన్స్​లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 5.1 తీవ్రత నమోదయింది. టెలికం వ్యవస్థ, విద్యుత్​ సరఫరాలో అంతరాయం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

By

Published : Jul 20, 2019, 12:24 PM IST

ఏథెన్స్​లో భూకంపం- 4కి.మీ ట్రాఫిక్ జామ్​

గ్రీస్ రాజధాని ఏథెన్స్​ను భూకంపం కుదిపేసింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. భూ ప్రకంపనలకు బెంబేలెత్తిన ప్రజలు.. భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

ఏథెన్స్ నగరానికి వయవ్యాన 23 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

శుక్రవారం భూంకంపం కారణంగా టెలికమ్యూనికేషన్​ వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రీస్​లో అతిపెద్ద నౌకాశ్రయం పోర్ట్​ పిరేయిస్​ నుంచి ఓడల ప్రయాణాలు నిలిచాయి.

భూకంప సమయంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డుపై నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.

గ్రీస్​ రాజధాని ఏథెన్స్​లో భూకంపం

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: క్షణాల్లోనే పవర్​ ప్లాంట్​ నేలమట్టం

ABOUT THE AUTHOR

...view details