కరోనా వైరస్తో అత్యధికంగా ప్రభావానికి గురైన దేశాల్లో ఇటలీ ఒకటి. కరోనా సంక్షోభంతో అక్కడ అన్ని వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇటలీ ఉంబ్రియాలో 200 ఏళ్లుగా మగ్గంతో నేచిన వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. అయితే కరోనా కారణంగా వస్త్ర పరిశ్రమపైనా నీలినీడలు కమ్ముకోవడం వల్ల అక్కడి పరిశ్రమ డీలా పడింది. కొవిడ్ వ్యాప్తి కారణంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉంబ్రియాలో నేత పరిశ్రమ సరికొత్త మార్గాన్ని ఎంచుకుని రాణిస్తోంది. 20శతాబ్దంలో ప్రారంభమైన తేలా అంబ్రా వర్క్షాప్ ప్రస్తుతం మాస్కులను తయారు చేస్తోంది. బంగారపు దారం, నూలుతో కలిపిన సున్నితమైన, ప్రభావవంతమైన వస్త్రాలను నేసి వాటితో మాస్క్ను తయారు చేస్తోంది.
పురాతన చరిత్ర
ఆరుగురు మహిళల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ వస్త్రదుకాణానికి పురాతన చరిత్ర ఉంది. సంప్రదాయ వస్త్రాలను ఇక్కడ మగ్గాలపై నేస్తారు. సిట్టా డి కాస్టెల్లోలోని తేలా అంబ్రా వర్క్షాప్ నిర్వహకులు కరోనాపై పోరులో భాగస్వామ్యం అయ్యేందుకు ఏప్రిల్లో ఆసుపత్రి సిబ్బందికి ఉచితంగా మాస్క్లను తయారు చేసి ఇచ్చారు. అదే సమయంలో వారికి ఖరీదైన మాస్కులు ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. వెంటనే బంగారపుదారంతో కలిపిన వస్త్రాలు నేసి వాటితో ఖరీదైన మాస్కులు తయరీ మొదలు పెట్టారు.
మిలమిల మెరుస్తూ..