తెలంగాణ

telangana

ETV Bharat / international

బోల్తా పడి బస్సు నుజ్జునుజ్జు- 10మంది మృతి

బస్సు బోల్తా పడి నుజ్జునుజ్జు అయిన ఘటనలో 10 మంది చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం క్రొయేషియాలో జరిగింది.

By

Published : Jul 25, 2021, 4:05 PM IST

bus crash
బస్సు ప్రమాదం

క్రొయేషియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. మరో 45 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం ఉదయం రాజధాని జాగ్రెబ్, సెర్బియా సరిహద్దు మధ్య ఉన్న స్లావోన్స్కీ వద్ద రహదారిపై బస్సు బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. దీంతో 60 మందికి పైగా ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గల కారణం తెలియలేదు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో 8 మందికి తీవ్ర గాయలైనట్లు సమాచారం. ఈ ఘటనపై క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెన్​కోవిక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి:ఘోర ప్రమాదంలో 32 మంది మృతి- రక్తసిక్తమైన రోడ్డు

ABOUT THE AUTHOR

...view details