తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2021, 2:51 PM IST

Updated : Apr 19, 2021, 3:09 PM IST

ETV Bharat / international

బ్రిటన్​ ప్రధాని భారత పర్యటన రద్దు

boris johnson
బోరిస్​ జాన్​సన్

14:48 April 19

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ భారత పర్యటన రద్దు

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. దేశంలో రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇదివరకే నిర్ణయమైన వచ్చేవారం పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు భారత్‌, బ్రిటన్‌ ప్రభుత్వాల తరఫున బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం డౌన్‌స్ట్రీట్‌ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది చివరిలో ఇరుదేశాల ప్రధానమంత్రులు సమావేశమై భారత్‌-బ్రిటన్‌ భవిష్యత్తు భాగస్వామ్యంపై చర్చిస్తారని పేర్కొంది. బ్రిటన్‌ ప్రధాని భారత పర్యటన వాయిదా పడటం ఇది రెండోసారి. వాస్తవానికి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు బోరిస్‌ జాన్సన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంది. అప్పుడు బ్రిటన్‌ స్ట్రెయిన్‌ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల బ్రిటన్‌ ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Last Updated : Apr 19, 2021, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details