తెలంగాణ

telangana

By

Published : Dec 2, 2020, 6:52 PM IST

ETV Bharat / international

బ్రిటీష్ ఇండియన్​ పుస్తకానికి 'చారిత్రక' అవార్డ్

బ్రిటీష్ ఇండియన్ జర్నలిస్ట్​ అనితా ఆనంద్ రాసిన పుస్తకం యూకే అత్యున్నత పురస్కారాన్ని కైవసం చేసుకుంది. జలియన్​వాలా బాగ్ ఉదంతంలో చిక్కుకున్న ఓ యువకుడి కథతో ఈ పుస్తకం రాశారు అనిత.

Anita Anand's Jallianwala Bagh story wins history prize
బ్రిటిష్ ఇండియన్​ పుస్తకానికి 'చారిత్రక' పురస్కారం

జలియన్​వాలా బాగ్ హత్యాకాండ నేపథ్యంలో బ్రిటీష్ ఇండియన్ జర్నలిస్ట్, రచయిత్రి అనితా ఆనంద్ రాసిన పుస్తకం యూకేలోని అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకుంది. 1919లో జరిగిన ఈ దారుణ ఘటనలో చిక్కుకున్న ఓ యువకుడి కథతో రాసిన 'ద పేషెంట్ అసాసిన్: ఏ ట్రూ టేల్ ఆఫ్ మాసెకర్, రివెంజ్ అండ్ ద రాజ్' పుస్తకానికి 'పెన్-హెసెల్ టిల్ట్​మన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020' పురస్కారం వరించింది. ఈ అవార్డు కోసం పోటీ పడ్డ మరో ఆరు పుస్తకాలను దాటుకొని పురస్కారం గెలుచుకుంది.

అనితా ఆనంద్ రాసిన పుస్తకం

అనితా ఆనంద్ రాసిన పుస్తకాన్ని 'వాస్తవ చారిత్రక మహాకావ్యం'గా అభివర్ణించారు న్యాయనిర్ణేతలు. వచ్చే దశాబ్దాల పాటు ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చని పేర్కొన్నారు. చారిత్రక దృఢత్వంతో పాటు పరిశోధాత్మక పుస్తకానికి ఈ ఏడాది పురస్కారం ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. అనితా రాసిన పుస్తకానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పారు.

రాజకీయ జర్నలిస్ట్ అయిన అనితా ఆనంద్.. 20 ఏళ్ల పాటు బీబీసీలో పనిచేశారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

చారిత్రక ఘటనలపై వెలువడిన పుస్తకాలకు ఏటా ఈ అవార్డులు ఇస్తారు. విజేతకు రెండు వేల పౌండ్ల నగదు బహుమతి అందిస్తారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details