పాకిస్థాన్ మైనారిటీ హింసపై చొరవ తీసుకోవాలని కోరుతూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు బ్రిటీష్ హిందూ సంఘాలు లేఖ రాశాయి. పాక్లో హిందువులు తీవ్రమైన హింసకు గురవుతున్నారని వివరిస్తూ ఇటీవల ఆదేశంలోని ఖైబర్ పంఖ్తుంక్వా రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని దగ్ధం చేసిన ఘటనను ఉదహరించాయి.
పాకిస్థాన్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేవిధంగా పాక్ ప్రధానిపై ఒత్తిడి తెచ్చే చర్యలు తీసుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ను కోరుతున్నాం. ఇటీవల పాక్లో హిందువుల పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. ఖైబర్ పంఖ్తుంక్వా దేవాలయ ఘటనపై ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రజాస్వామ్యదేశాలతో కలిసి బ్రిటన్ ముందుండి విచారణ జరిపించాలని వేడుకుంటున్నాం.
- బ్రిటీష్ హిందూ సంఘాలు