పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కాప్26 ప్రపంచ వాతావారణ సదస్సులో ప్రసంగించారు.
"గ్లోబల్ వార్మింగ్ను ప్రపంచ దేశాలు కలిసి ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సవాళ్లలో ఇది ప్రధానమైంది. ఈ అంశంపై మనంలో మనం వాదించుకోవడానికి ఎక్కువ సమయంలేదు. ఈ పోరాటంలో వెనక్కి వెళ్లలేని పరిస్థితి నెలకొంది."