కరోనా వైరస్ చైనాలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఇటలీ, ఇరాన్ సహా ఆయా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7100మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు. 1,83, 000మందికి పైగా వైరస్ బారినపడ్డారు. చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న ఇటలీలో శని, ఆదివారాల్లో 349మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 2158కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో పావు వంతు కేసులు ఇటలీలోనే నమోదయ్యాయి. మొత్తంగా ఆ దేశంలో 27, 980మందికి వైరస్ సోకింది.
ఇరాన్లో...
ఇరాన్లో తాజాగా 135మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 988కి చేరింది. ఇరాన్లో ఇప్పటివరకు 16, 169 మందికి కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు.
పర్షియన్ నూతన ఏడాది నౌరోజ్ వేడుక సమీపిస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఇరాన్ ప్రజలు జంకుతున్నారు. నౌరోజ్ వేడుక సందర్భంగా టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించారు అధికారులు. చహర్షంబే సూరీగా పిలిచే ఈ నూతన ఏడాది వేడుకల సందర్భంగా ఎవరూ సామాజికంగా కలవకూడదని పిలుపునిచ్చింది ప్రభుత్వం.
వుహాన్లో ఒకే కేసు..
వైరస్ మొదటిసారిగా బయటపడిన చైనా వుహాన్లో తాజాగా ఒకే ఒక్క కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు.
స్పెయిన్లో...
కరోనా వైరస్ ప్రభావిత దేశాల్లో స్పెయిన్ ఒకటి. తాజాగా 2వేల కరోనా కేసులు నమోదయ్యాయని ప్రకటించింది స్పెయిన్. వైరస్ సోకిన వారి సంఖ్య 11, 178కి చేరింది. 491మంది ప్రాణాలు కోల్పోయారు. 1098మందికి కరోనా నయమయినట్లు సమాచారం.
కరోనా నేపథ్యంలో పోలాండ్ ప్రభుత్వ యంత్రాంగం స్వీయ నిర్బంధంలో ఉంది. ఓ మంత్రికి కరోనా సోకిందని తేలిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది సర్కారు.
అమెరికాలో..