తెలంగాణ

telangana

ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓలో 65 మంది సిబ్బందికి కరోనా - డబ్ల్యూహెచ్​ఓ సిబ్బందికి కరోనా

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో మొత్తం 65 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది. అందులో సగం మంది ఇంటి నుంచి పనిచేస్తుండగా.. మిగతా వారు జెనీవాలోని కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అసోసియేటెడ్​ ప్రెస్​కు లభించిన అంతర్గత ఈమెయిల్​ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే.. జెనీవాలోని సంస్థ కార్యాలయంలో ఎలాంటి వైరస్ వ్యాప్తి లేదని డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది.

WHO staff have virus
డబ్ల్యూహెచ్​ఓలో 65 మంది సిబ్బందికి కరోనా

By

Published : Nov 17, 2020, 5:41 AM IST

కరోనా మహమ్మారిపై ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే.. ఆ సంస్థలోనూ వైరస్​ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. ఈ అంశంపై అంతర్గతంగా ఉద్యోగులకు అందిన ఈమెయిల్​ ద్వారా వైరస్​ వ్యాప్తిపై అసోసియేటెడ్​ ప్రెస్​ కీలక వివరాలు వెల్లడించింది. జెనీవాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తోన్న 65 మంది సిబ్బందికి వైరస్​ సోకినట్లు తెలిపింది. అలాగే ఒక క్లస్టర్​ వ్యాప్తి ఉన్నట్లు వార్తా సంస్థ వెల్లడించింది. అయితే.. జెనీవా ప్రధాన కార్యాలయంలో ఎలాంటి వైరస్​ వ్యాప్తి లేదని డబ్ల్యూహెచ్​ఓ బహిరంగంగా తెలపటం గమనార్హం.

ఐరోపాతో పాటు ఆతిథ్య స్విట్జర్లాండ్​, జెనీవా నగరంలో కేసుల పెరుగుదల మధ్య ఈ వివరాలు బయటకు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా బారిన పడిన డబ్ల్యూహెచ్​ సిబ్బందిలో సగం మంది ఇంటి నుంచి పనిచేసే వారే ఉన్నట్లు ఈమెయిల్​ తెలిపింది. కార్యాలయంలో పని చేస్తున్న 32 మంది వైరస్​ బారిన పడటం సంస్థ అమలు చేస్తోన్న కఠినమైన పరిశుభ్రత, స్క్రీనింగ్​, ఇతర కట్టడి చర్యలు సరిపోవని సూచిస్తోంది.

డబ్ల్యూహెచ్​ఓలో వ్యాపార కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న రౌల్​ థామస్​ శుక్రవారం ఐదుగురికి కరోనా పాజిటివ్​గా తేలిందని సిబ్బందికి ఈమెయిల్​ పంపారు. అందులో ఒకే బృందానికి చెందిన వారు నలుగురు ఉండగా.. వారితో కలిసిన వ్యక్తి ఒకరు ఉన్నట్లు తెలిపారు. అయితే.. ఈమెయిల్​లో క్లస్టర్​ వ్యాప్తి అని సూచించలేదు. అవసరమైన ప్రోటోకాల్స్​ ప్రకారం ఈ సిబ్బంది వైద్య సాయం పొందుతూ ఇంట్లో ఉంటూ కోలుకుంటున్నారని ఈమెయిల్​లో పేర్కొన్నారు.

ఈమెయిల్​ ద్వారా బయటపడిన సమాచారం నిజమైనదేనని డబ్ల్యూహెచ్ అధికార ప్రతినిధి ఫరాహ్​ దఖ్లాలాహ్​ వ్యాఖ్యల ద్వారా తేలింది.

" కరోనా వైరస్​ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రస్తుత ఐదుగురితో జెనీవాలో ప్రధాన కార్యాలయంలో మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 65కు చేరింది. "

- ఫరాహ్​ దఖ్లాలాహ్​, డబ్ల్యూహెచ్​ఓ అధికార ప్రతినిధి

ఈ మెయిల్​ ప్రకారం మొత్తం కేసుల్లో 49 మంది గత ఎనిమిది వారాల్లో వైరస్​ బారినపడ్డారని, జెనీవా, పరిసర ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితిని సూచిస్తోందని తెలిపారు డబ్ల్యూహెచ్​కు చెందిన ఓ అధికారి. టెలీవర్క్​ చేసే వారిలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, కానీ ఇంకా అవి బయటపడలేదన్నారు.

చివరగా.. వైరస్​ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఈమెయిల్​ పేర్కొంది. భౌతిక సమావేశాలు, ముఖ్యంగా సాధారణ ప్రదేశాలు, ఫలహారశాలలో సమావేశాలను నిషేధించాలని పేర్కొంది. కచ్చితంగా అవసరమైన చోట మాత్రమే సమావేశాలు ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్​ వచ్చినా కొవిడ్​ నిబంధనలు మానొద్దు'

ABOUT THE AUTHOR

...view details