కొవిడ్-19 (కరోనా) ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ల ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా ఫ్రాన్స్ మర్సై నగరంలోని ఓ ఆసుపత్రిలో దాదాపు 2,000 మాస్కులు దోపిడీకి గురయ్యాయి.
ఈ మాస్క్లు అన్నీ శస్త్రచికిత్స చేసే సమయంలో ధరించేవని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మాస్క్లు, చేతి గ్లౌజుల భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.