తెలంగాణ

telangana

'కరోనా గబ్బిలాల కాటుకు గురయ్యాం'

By

Published : Jan 18, 2021, 7:07 AM IST

Updated : Jan 18, 2021, 7:27 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) బృందం పర్యటన నేపథ్యంలో వుహాన్ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన విడుదల చేశారు. 2017లో తాము గబ్బిలాల కాటుకు గురయ్యామని అంగీకరించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా శాస్త్రవేత్తలు సజీవ గబ్బిలాలను పట్టుకున్నట్లు వీడియో దృశ్యాల ద్వారా వెల్లడైంది.

wuhan lab
'కరోనా గబ్బిలాల కాటుకు గురయ్యాం'

కరోనా వైరస్ మూలాలపై దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో చైనాలోని వివాదాస్పద వుహాన్ వైరాలజీ ల్యాబ్​లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని బయటపెట్టారు. 2017లో ఒక గుహలో నమూనాలు సేకరించే సమయంలో తాము గబ్బిలాల కాటుకు గురయ్యామని అంగీకరించారు.

కోరలు గ్లౌజుల్లోకి చొచ్చుకెళ్లాయి..

అక్కడ కరోనా వైరస్​కు ఆవాసంగా ఉన్న గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వాటి కోరలు సూదుల్లా తమ రబ్బరు గ్లౌజుల్లోకి చొచ్చుకెళ్లాయని చెప్పారు. 2017 నాటి కొన్ని వీడియో దృశ్యాలను పరిశీలించినప్పుడు ఈ ల్యాబ్​ సిబ్బంది కనీసం గ్లౌజులు మాస్కులు ధరించకుండానే సజీవ గబ్బిలాలను పట్టుకోవడం కనిపించింది.

ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) భద్రతా నిబంధనలకు విరుద్ధం. కరోనా మూలాలపై దర్యాప్తు చేసేందుకు 13 మంది నిపుణులతో కూడిన డబ్ల్యూహెచ్​ఓ బృందం ఇప్పటికే బీజింగ్​ చేరుకుంది. తాజాగా వెలుగు చూసిన అంశాలపై వీరు దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి :తీవ్ర కొవిడ్​ ముప్పు వారిని గుర్తించే రక్త పరీక్ష

Last Updated : Jan 18, 2021, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details