కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. ఇరాన్లో తాజాగా వైరస్ బారిన పడి 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 92కు చేరుకుంది. మరో 2,922 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ నివారణకు సైన్యాన్ని రంగంలోకి దించింది.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో మాత్రం కరోనా నమోదైన కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బుధవారం 435 కొత్త కేసులను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇది మంగళవారం ప్రకటించిన 851 కేసుల్లో సగం కావడం గమనార్హం. కరోనాకు కేంద్ర బిందువైన చైనా తరువాత అంతగా నష్టపోయిన దేశం దక్షిణ కొరియానే. ప్రస్తుతానికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 32కి చేరుకోగా, 5,621గా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనాను కట్టడి చేసేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ఇప్పటికే 10 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ను ప్రతిపాదించింది.
ఇరాక్లో మొదటి మరణం..
ఇరాక్లో కరోనా వల్ల తొలి మరణం నమోదైంది. ప్రస్తుతం ఆ దేశంలో 31 పాజిటివ్ కేసులున్నాయి.
చైనాలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా 2,981 మంది మరణించారు. 80,270 మంది వైరస్ బారిన పడ్డారు. తమ దేశంలో పర్యటిస్తున్న 6700 మంది ప్రయాణికుల్లో 75 మందికి కరోనా సోకినట్లు చైనా కస్టమ్స్ అధికారులు తెలిపారు.