తెలంగాణ

telangana

స్మార్ట్​ఫోన్​ తెరలపై 28 రోజులు సజీవంగా వైరస్​!

By

Published : Oct 13, 2020, 7:17 AM IST

గాజు పాత్రలు, స్మార్ట్​ఫోన్ తెరలు, స్టెయిన్​లెస్​ స్టీల్​, కరెన్సీ నోట్లు వంటి నునుపైన వస్తువులపై కరోనా వైరస్​ ఎక్కువ రోజులు ఉంటున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. స్మార్ట్​ఫోన్ తెరలపై 28 రోజుల వరకూ వైరస్ చైతన్యవంతంగా ఉంటున్నట్లు తేలింది.

world bank report on schools closing in asia countries
స్మార్ట్​ఫోన్​ తెరలపై 28 రోజుల పాటు వైరస్​!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​.. కరెన్సీ నోట్లు, స్మార్ట్​ఫోన్ తెరలపై 28 రోజుల వరకూ చైతన్యవంతంగా ఉంటున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్​ డిసీజ్​ ప్రిపేర్డ్​నెస్​ పరిశోధకులు దీన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ రకాల వస్తువులపై కృత్రిమ శ్లేష్మంతో కూడిన కరోనా వైరస్​ను ఉంచారు. తర్వాత ఉష్ణోగ్రతలను 30నుంచి 40 డిగ్రీల సెల్సియస్​ మధ్య మార్చుతూ సుమారు నెల రోజుల పాటు ఆ నమూనాలు పరీక్షించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వైరస్ బలహీనపడినట్లు గుర్తించారు.

'గాజు పాత్రలు, స్మార్ట్​ఫోన్ తెరలు, స్టెయిన్​లెస్​ స్టీల్​, కరెన్సీ నోట్లు వంటి నునుపైన వస్తువులపై వైరస్​ ఎక్కువ రోజులు ఉంటోంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు.. ముఖ్యంగా 20 డిగ్రీల సెల్సియస్ వద్ద వైరస్ చాలా బలంగా ఉంటోంది. వస్తువుల రకం, పరిసరాల ఉష్ణోగ్రత, వైరస్ తీవ్రత, శరీరం నుంచి వెలువడే శ్లేష్మం, నీటి తుంపర్లలోని ప్రొటీన్​, కొవ్వు స్థాయులపై ఆధారపడి వైరస్​ మనుగడ సాగిస్తోంది. అని పరిశోధనకర్త డెబ్బీ ఈగ్లెస్​ పేర్కొన్నారు. ఈ వివరాలను 'వైరాలజీ జర్నల్' అందించింది.

ABOUT THE AUTHOR

...view details