తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ సాయంతో నేపాల్​లో ఆలయ పునరుద్ధరణ పనులు - భారత్​ సాయం నేపాల్​ ప్రభుత్వం

నేపాల్​లోని చారిత్రక సెటో మచీంద్రనాథ్ ఆలయ పునరుద్ధరణ పనులను ఆ దేశ ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ఈ పునురుద్ధరణ పనులకు భారత్ ఆర్థిక​ సాయం అందించడం విశేషం.

seto macchindranath temple
భారత్​ సాయంతో నేపాల్​లో ఆలయ పునరుద్ధరణ పనులు

By

Published : Mar 1, 2021, 5:41 AM IST

భారత ప్రభుత్వం ఆర్థిక సాయమందించగా.. నేపాల్​ రాజధాని కాఠ్​మాండూలోని చారిత్రక సెటో మచీంద్రనాథ్​ దేవాలయ పునురద్ధరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి.

2017లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. నేపాల్​లోని 28 వారసత్వ ప్రదేశాల పునర్నిర్మాణం కోసం ​ రూ.580 కోట్లను అందిస్తామని భారత్ హామీ ఇచ్చింది. ఈ మేరకు అందిన నిధులతో సేటో మచీంద్రనాథ్​ ఆలయ పునురుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. నేపాల్​లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, నేపాల్ జాతీయ పునర్నిర్మాణ అథారిటీ సీఈఓ సుశీల్ గ్యవాలి, కాఠ్​మాండూ మెట్రోపాలిటన్ మేయర్ బిడియా సుందర్ శాక్య ఆదివారం ఈ పనులకు 'భూమి పూజ' నిర్వహించారు.

నేపాల్ ప్రభుత్వం ఆమోదించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఈ పునరుద్ధరణ పనులకు ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్​(ఐఎన్​టీఏసీహెచ్​) సాంకేతిక సహకారం అందిస్తోంది. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ సెటో మచీంద్రనాథ్ ఆలయం.. 2015 ఏప్రిల్‌లో సంభవించిన భూకంపంలో దెబ్బతింది. సెటో మచీంద్రనాథ్​ను బౌద్ధులు, హిందువులు పూజిస్తారు.

ఇదీ చదవండి:17 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్​

ABOUT THE AUTHOR

...view details