ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడొడొకు ఆ దేశ ప్రజలు మరోసారి పట్టంగట్టారు. ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థి ప్రొబోవో సుబుయాంటోపై విడొడొ విజయం సాధించారు. మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియాలోని 15.4 కోట్ల ఓటర్లలో... దాదాపు 8.56 కోట్ల మంది విడోడోకు ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 2 లక్షల 45 వేల మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
సర్వత్రా ఉద్రిక్తతలు...
గత వారం డజనుకుపైగా అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఇండోనేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓట్ల లెక్కింపులో అవతకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన సుబయాంటో తీవ్ర స్థాయి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఉద్రిక్త వాతావరణం వల్ల బుధవారం వెలువడాల్సిన ఫలితాలను మంగళవారమే విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
మోదీ అభినందనలు
రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విడొడొను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. విడొడొ సారథ్యంలో ఇండోనేషియా ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: ఓట్లు లెక్కిస్తూనే 272 మంది మృతి