తెలంగాణ

telangana

By

Published : Jan 21, 2020, 6:56 AM IST

Updated : Feb 17, 2020, 8:00 PM IST

ETV Bharat / international

చైనా వైరస్​: అత్యవసర భేటీకి డబ్ల్యూహెచ్​ఓ పిలుపు

చైనాను ప్రస్తుతం కరోనా​ వైరస్​ పట్టి పీడుస్తోంది. మరో మూడు ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాపించింది. ఈ వైరస్​ గురించి చర్చించేందుకు డబ్ల్యూహెచ్​ఓ బుధవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

WHO to hold emergency meeting as SARS-like virus spreads in Asia
చైనా వైరస్​: అత్యవసర భేటీకి డబ్ల్యూహెచ్​ఓ పిలుపు

చైనా సహా మరో మూడు ఆసియా దేశాలను​ కరోనా వైరస్​ వణికిస్తోంది​. ఈ నేపథ్యంలో అంటువ్యాధులు, వైరస్​ గురించి చర్చించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) బుధవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

జెనీవా వేదికగా జరిగే ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్​ఓ.. ఈ వైరస్​ ప్రభావం కారణంగా.. ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలా వద్దా అని నిర్ణయించనుంది. అతి పెద్ద అంటువ్యాధులను మాత్రమే ఇలా పరిగణిస్తారు.

కరోనా వైరస్​గా పిలిచే ఈ అంటువ్యాధిని మొదటిసారి చైనా, హాంకాంగ్​ భూభాగాల్లో గుర్తించారు. ఇది 'సివియర్​ అక్యూట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​' (సార్స్) వైరస్​ లక్షణాలు కలిగి ఉన్నట్లు నిపుణులు తెలిపారు. 2003లో ఈ వైరస్​ కారణంగా సుమారు 650 మంది మరణించారు. ప్రస్తుతం సుమారు 208 మంది ఈ కొత్త వైరస్​తో బాధపడుతున్నారు.

కొత్త కేసుల కలకలం

బీజింగ్​, షాంఘై ప్రాంతాల్లో సోమవారం ఈ కరోనా వైరస్​ లక్షణాలున్న కేసులను గుర్తించారు. దక్షిణ గ్వాంగ్​డాంగ్​ రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇక వుహాన్​లో వారాంతంలో 136 కొత్త కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వుహాన్​లోని సీ ఫుడ్​ మార్కెట్​ను​.. వైరస్​ వ్యాప్తికి కేంద్రంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.

వైద్యులకూ వ్యాప్తి

ఈ వైరస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. గ్వాంగ్​​ డాంగ్​, వుహాన్​ను సందర్శించిన కుటుంబంలో ఇద్దరికి ఈ వైరస్​ సోకినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. రోగులకు సాయం చేస్తోన్న 14 మంది వైద్య సిబ్బందికీ ఈ వ్యాధి సోకినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన వాటిలో 95కు పైగా కేసులు వుహాన్​కు చెందినవేనని పేర్కొన్నారు.

బీజింగ్​లో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో మొదటి కేసు బయటపడింది. థాయ్​లాండ్​, జపాన్​ దేశాల్లోనూ మూడు కేసులు నమోదు కాగా.. వారంతా చైనాలోని వుహన్​ ప్రాంతాన్ని సందర్శించన వారే కావడం గమనార్హం. వూహాన్​లో 170 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 9మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం

Last Updated : Feb 17, 2020, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details