తెలంగాణ

telangana

ETV Bharat / international

శాంతి చర్చల వేళ కాబుల్​లో తాలిబన్ల దాడి

అఫ్గానిస్థాన్​లో మరోసారి తాలిబన్లు పంజా విసిరారు. ఖతార్ వేదికగా అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే కాబుల్​లో ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనలో 9మందికి తీవ్రగాయాలయ్యాయి.

By

Published : May 8, 2019, 5:06 PM IST

శాంతి చర్చల వేళ కాబుల్​లో తాలిబన్ల దాడి

అఫ్గానిస్థాన్​లో శాంతి కోసం తాలిబన్లు, అమెరికా మధ్య ఖతార్​ వేదికగా చర్చలు జరుగుతున్నప్పుడే ఆ ఉగ్రసంస్థ దాడికి తెగబడింది. కాబుల్​లో ఓ అంతర్జాతీయ సామాజిక సంస్థ కార్యాలయంలోకి చొరబడి బాంబులు పేల్చారు ఉగ్రవాదులు. ఈ దాడిలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

'కౌంటర్ పార్ట్ ఇంటర్నేషనల్' సామాజిక సంస్థపై దాడి జరిగిందని హోంమంత్రిత్వ శాఖ నిర్ధరించింది.

"కొంతమంది సాయుధులు సామాజిక సంస్థ పరిసరాల్లోకి చొచ్చుకెళ్లి బాంబుదాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంస్థ చుట్టూ మోహరించారు. ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది."

-నస్రత్ రష్మీ, హోం శాఖ అధికార ప్రతినిధి

కార్యాలయంలోని 150 మంది సిబ్బందిని భద్రతా దళాలు రక్షించాయి.

తాలిబన్ల ప్రకటన

కౌంటర్​ పార్ట్ ఇంటర్నేషనల్​ సంస్థ అపాయకర చర్యల్లో పాలు పంచుకుంటోందని, అమెరికాకు చెందిన యూస్​ఎయిడ్ సంస్థతో కుమ్మక్కయిందని ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు తాలిబన్లు.

ఎలా ముందుకు..?

అఫ్గాన్​లో పైచేయి సాధించేందుకు తాలిబన్లు 18 ఏళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా-తాలిబన్ల చర్చలతో సమస్య పరిష్కారం అవుతుందని అందరూ ఆశించారు. అలాంటి సమయంలో జరిగిన దాడితో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనే అవకాశం ఉంది.

శాంతి చర్చల వేళ కాబుల్​లో తాలిబన్ల దాడి

ఇదీ చూడండి: కేంద్రంలో 'కిచిడీ సర్కార్' లేనట్టే: మోదీ

ABOUT THE AUTHOR

...view details