తెలంగాణ

telangana

ETV Bharat / international

తలొగ్గిన పాక్​.. 'డానియేల్​' తీర్పుపై సమీక్ష - daniel pearl case virdict review in pak supreme court

డానియేల్​ పెరల్​ హత్య కేసులో తమ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. అమెరికా, ఐరాస నుంచి పాకిస్థాన్​ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పాక్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పును పునఃసమీక్షించేందుకు సింధ్​ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో తాము కూడా పాలుపంచుకుంటామని ప్రకటించింది.

US Seeks Accountability From Pakistan In Daniel Pearl's Murder Case
డానియెల్​ పెరల్​ హత్య కేసులో పాక్​ జవాబుదారితనం

By

Published : Jan 31, 2021, 3:27 PM IST

అమెరికా పాత్రికేయుడు డానియేల్ పెరల్​​ హత్య కేసులో పాకిస్థాన్​​ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా, ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. సుప్రీం తీర్పును పునఃసమీక్ష కోసం సింధ్‌ రాష్ట్ర యంత్రాంగం చేస్తున్న చర్యల్లో తామూ భాగస్వాములం అవుతామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. సింధ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పటిషన్​లో తమను కూడా కక్షిదారుగా చేర్చుకోవాలని తగిన అప్లికేషన్​ను సుప్రీంకోర్టుకు అందివ్వనున్నట్టు పాక్‌ అటార్నీ జనరల్‌ ప్రతినిధి తెలిపారు.

2020లో.. పాకిస్థాన్‌ నిఘా సంస్ధ ఐఎస్​ఐ, అల్‌ఖైదాకు మధ్య సంబంధాలపై పరిశోధన చేస్తుండగా ఉగ్రవాదులు.. అమెరికా వాల్​స్ట్రీట్​ పత్రికకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు డానియేల్‌ పెరల్​​ను అపహరించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అల్‌ఖైదా ఉగ్రవాది అహ్మద్‌ ఒమర్‌ సయీద్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ఈ నెల 28న తీర్పు వెలువరించింది. దీనిపై అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి:పాక్‌ సుప్రీంకోర్టు తీర్పుపై శ్వేతసౌధం ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details