తెలంగాణ

telangana

ETV Bharat / international

'వారి దాడుల వల్లే అఫ్గాన్​ పౌరులు మరణిస్తున్నారు' - UN: Civilian deaths by Taliban and Afghan forces on the rise

అఫ్గానిస్థాన్​లో వెంటనే హింసకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి(ఐరాస). తాలిబన్​, అఫ్గాన్​ భద్రతా దళాల దాడుల్లో వేల మంది సామాన్య పౌరులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇస్లామిక్ స్టేట్​ బృందం చేసిన దాడులు, క్రూరత్వంపై ఐరాస ఆందోళన చెందుతోంది.

UN: Civilian deaths by Taliban and Afghan forces on the rise
'వారి దాడులు వల్లే అఫ్గాన్​ పౌరులు మరణిస్తున్నారు'

By

Published : May 19, 2020, 2:55 PM IST

Updated : May 19, 2020, 3:04 PM IST

అఫ్గాన్​లో హింస నిత్యకృత్యం అయిపోయింది. ఎంతలా అంటే అక్కడ ప్రజలు శాంతి అనే పదం ఒకటి ఉందా! అనేంతలా. అక్కడి పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) అసహనం వ్యక్తం చేసింది. తాలిబన్లు, అఫ్గానిస్థాన్​ భద్రత దళాల పోరు ఫలితంగా సామాన్య ప్రజల మరణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ఐరాస. అఫ్గాన్​లో హింసను తక్షణమే అరికట్టాలని పిలుపునిచ్చింది.

వారి చేసిన పనే..

గత వారం అఫ్గానిస్థాన్​లోని ఓ ప్రసూతి ఆస్పత్రిపై భయంకరమైన దాడులు జరిగాయి. ఇందులో 24 మంది మృతి చెందారు. వారిలో ఇద్దరు పసిబిడ్డలూ ఉన్నారు. దీనికి కారణం ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. అయితే కాబుల్​ పరిసర ప్రాంతాల్లోని మైనారిటీ వర్గం షియాలను లక్ష్యంగా చేసుకొని.. అఫ్గాన్​ ఇస్లామిక్​ స్టేట్​ తరచు దాడులు చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఆస్పత్రిపై దాడి వారి పనేనని అనుమానం వ్యక్తం చేసింది అగ్రరాజ్యం.

ఇదీ చూడండి: శాంతి ఒప్పందమే అఫ్గాన్​ పాలిట శాపమా?

దాడులను ఖండించిన తాలిబన్​

ప్రసూతి దాడుల్లో తమ ప్రమేయం లేదని తాలిబన్లు ఖండించారు. దేశ విద్రోహశక్తులైన ఉగ్రమూకలను అణిచివేసే క్రమంలో జరిగిన కాల్పుల్లో పౌరులు మృతి చెందారు. సామాన్య పౌరులు తమ లక్ష్యం కాదని అఫ్గాన్​ భద్రత దళాలు స్పష్టం చేశాయి. అయితే తాలిబన్ల దాడుల్లో 208 మంది పౌరులు మరణించగా.. అఫ్గాన్​ భద్రత దళాల ఎదురుకాల్పుల ఫలితంగా 172 మంది చనిపోయినట్లు ఐరాస నివేదిక విడుదల చేసింది.

" దేశంలో శాంతి కోసం తాలిబన్​- అఫ్గాన్​ కట్టుబడి ఉండాలి. ప్రజల ప్రాణాలను రక్షించాలి. యుద్ధాన్ని అంతం చేయాలన్న ప్రజల ఆశను దెబ్బతీయకూడదు. దేశంలో సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది."

-డెబోరా లయన్స్​, అఫ్గాన్​ తరఫున ఐరాస ప్రత్యేక ప్రతినిధి

అమెరికా అదే కోరుకుంటోంది!

అఫ్గాన్​లో హింసను అంతం చేయాలని అమెరికా కూడా పిలుపునిచ్చింది. అగ్రరాజ్యం ప్రత్యేక శాంతి ప్రతినిధి ఖలీజాద్.. తాలిబన్​లతో మరోసారి చర్చలు జరపాలని కోరింది అగ్రరాజ్యం. హింసను వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఇదీ చూడండి:కరోనాను పసిగట్టే సూపర్​ స్మార్ట్​ 'మాస్క్'

Last Updated : May 19, 2020, 3:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details