తెలంగాణ

telangana

By

Published : Mar 9, 2019, 4:36 PM IST

Updated : Mar 9, 2019, 5:43 PM IST

ETV Bharat / international

మొన్న విజయ్ మాల్యా... ఇప్పుడు నీరవ్ మోదీ!

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి లండన్​ పరారైన విజయ్​ మాల్యాను భారత్​కు అప్పగించాలని ఇటీవలే తీర్పునిచ్చింది లండన్​ వెస్ట్​మినిస్టర్​ కోర్టు. ఇప్పుడదే కోర్టులో నీరవ్ మోదీ అప్పగింతపై విచారణ జరగనుంది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీ

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీ

పంజాబ్ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బ్రిటన్​​ సూచనప్రాయంగా అంగీకరించింది. నీరవ్​ మోదీని తమకు అప్పగించాలని భారత్​ చేసిన విజ్ఞప్తిపై న్యాయప్రక్రియ ప్రారంభించింది.

మరో రెండు రోజుల్లో నీరవ్​ మోదీ కేసును లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ న్యాయస్థానం ముందు ఉంచుతామని బ్రిటన్​ హోంమంత్రి సాజిద్​ జావేద్​ కార్యాలయం నుంచి ఈడీకి సమాచారం అందింది.

త్వరలోనే ఈడీ, సీబీఐ అధికారులు కలిసి లండన్​ వెళ్లి, నీరవ్​ మోదీ నేరాలపై అక్కడి న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పించనున్నారు. మరో బ్యాంకు కుంభకోణ నిందితుడు విజయ్​మాల్యా కేసులోనూ సాక్ష్యాధారాలు అందజేస్తారు.

ఘరానా మోసగాళ్లు....

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో నీరవ్​ మోదీ, అతని మామ మెహుల్​ చోక్సీ, కొందరు బ్యాంకు అధికారులు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఈడీ, సీబీఐలు అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేశాయి. వెంటనే వీరు దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్​కు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీరవ్​ కోసం ఇప్పటికే ఇంటర్​పోల్ రెడ్​కార్నర్​ నోటీసులు జారీ చేసింది.

Last Updated : Mar 9, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details