కరోనా రోజురోజుకూ మరింత విజృంభిస్తూనే ఉంది. బాధితులు చైనాలోనే అధిక భాగం ఉన్నప్పటికీ మెల్లమెల్లగా దక్షిణ కొరియానూ ఈ కొవిడ్-19 వైరస్ వణికిస్తోంది. చైనా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా ద.కొరియా రెండో స్థానంలో ఉంది.
సోమవారం రోజు మరో 161, మంగళవారం మరో 60 కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య ఇక్కడ 893కు చేరింది. ఇప్పటివరకు దక్షిణ కొరియాలో కరోనా సోకిన వారిల్లో మృతుల సంఖ్య 8కు చేరినట్లు అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తితో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధ్యక్షుడు మూన్-జే-ఇన్. ఈ నేపథ్యంలో చైనా నుంచి రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.