తెలంగాణ

telangana

ETV Bharat / international

బాంబు దాడులతో దద్దరిల్లిన అఫ్ఘానిస్థాన్ - విశ్వవిద్యాలయం బస్సు

అఫ్ఘానిస్థాన్​లో సామాన్యులు లక్ష్యంగా ఉగ్రమూకలు దాడులకు తెగబడ్డాయి. రాజధాని కాబూల్​లో మూడు చోట్ల బాంబులు పేల్చాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.

అఫ్ఘానిస్థాన్​లో వరుస బాంబు దాడులు

By

Published : Jun 2, 2019, 3:37 PM IST

అఫ్ఘానిస్థాన్​ రాజధాని కాబూల్​లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. మూడు చోట్ల బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాయి. సామాన్యులు లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో రెండు బాంబులు ఒకే ప్రాంతంలో పేల్చివేశారని అఫ్ఘాన్ పోలీసులు నిర్ధరించారు.

మరో బాంబును విశ్వవిద్యాలయానికి వెళుతున్న బస్సుకు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 10మంది గాయపడ్డారు. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారని సమాచారం.

పేలుళ్లు తమ పనేనని ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. కానీ కాబూల్​లో క్రియాశీలంగా ఉన్న తాలిబన్, ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రసంస్థల పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

అఫ్ఘానిస్థాన్​లో వరుస బాంబు దాడులు

ఇదీ చూడండి: భారత రాయబారి ఇఫ్తార్​ విందుకు పాక్ ​అటంకం

ABOUT THE AUTHOR

...view details