అఫ్గానిస్తాన్లో మార్చి నెలలో జరిగిన వరుస పేలుళ్లు, లక్షిత దాడుల్లో కనీసం 305 మంది పౌరులు మరణించగా, మరో 350 మంది గాయపడ్డారని 'టోలో న్యూస్' నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో మరణాలు 20 శాతం పెరిగాయి.
అయితే ఇవి మీడియాతో పంచుకున్న గణాంకాలు మాత్రమే కాగా.. యుద్ధాల్లో మరణించిన వారే అధికంగా ఉన్నారని భద్రతా దళాలు తెలిపాయి. రోజుకు కనీసం 20-30 మంది అఫ్గాన్ సైనికులు మరణిస్తున్నట్లు వెల్లడించాయి.