తెలంగాణ

telangana

By

Published : May 12, 2021, 8:15 AM IST

ETV Bharat / international

'ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే భారత్‌తో చర్చలు'

జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు విషయంలో భారత్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇమ్రాన్​ ఖాన్ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించేవరకు ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.

Imran Khan
'ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే భారత్‌తో చర్చలు'

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించేవరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు విషయంలో భారత్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఒక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

అంతకు ముందు పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి విలేకరులతో మాట్లాడుతూ.. కశ్మీర్‌ ప్రజలకు భారత్‌ ఉపశమనం కల్పించిన తర్వాతే పాక్‌ చర్చలు జరుపుతుందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌ అంశం ఐరాస అజెండాలోనూ ఉన్నందువల్ల అది ఎంత మాత్రం భారత్‌ అంతర్గత విషయం కాదన్నారు.

ఇదీ చూడండి:ఇజ్రాయెల్​-పాలస్తీనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు!

ABOUT THE AUTHOR

...view details