తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 2:13 PM IST

ETV Bharat / international

తాలిబన్ల ఘాతుకానికి 16 మంది సైనికులు బలి

అఫ్గాన్​లో తాలిబన్లు జరిపిన దాడిలో 16 మంది సైనికులు అమరులయ్యారు. ప్రభుత్వ చెక్​పోస్టులు లక్ష్యంగా జరిగిన ఈ కాల్పుల్లో మరికొందరు గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియా తెలిపింది.

Taliban kill 16 Afghan servicemen in Nangarhar province
తాలిబన్లు ఘాతుకానికి 16 మంది సైనికులు మృతి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ఖొగ్యానీ జిల్లాలోని గండమక్​ ప్రాంతంలో ప్రభుత్వ చెక్​పోస్టులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ దాడిలో 16 మంది సైనికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి మీడియా వెల్లడించింది.

ఈ ఘటనలో మూడు భద్రతా స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఖతార్​లో శనివారం ప్రారంభం కానున్న ఇంట్రా-అఫ్గాన్ శాంతి చర్చలకు ముందే ఈ దాడి జరగడం గమనార్హం. గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసాకాండ నుంచి శాశ్వత విముక్తి కల్పించడానికి ఈ చర్చలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:ట్రంప్​ మళ్లీ ఎన్నికైతే అమెరికా-ఇరాన్​ మధ్య డీల్​..!

ABOUT THE AUTHOR

...view details