తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2019, 5:04 PM IST

ETV Bharat / international

అఫ్గాన్​లో తాలిబన్ల దాడి.. 10 మంది సైనికులు మృతి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మరో సారి సైనిక స్థావరంపై బాంబు దాడికి తెగబడ్డారు. 10 మంది సైనికులను పొట్టన బెట్టుకున్నారు.

afghan
అఫ్గాన్​లో తాలిబన్ల దాడి.. 10 మంది సైనికులు మృతి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ హెల్​మండ్​ రాష్ట్రంలోని సైనిక స్థావరంలో బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది అఫ్గాన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

ఇదీ జరిగింది

సంగిన్​ జిల్లాలోని సైనిక స్థావరంలో ఓ సొరంగాన్ని తవ్వి అందులో బాంబు పేల్చినట్లు ఓ సైనిక ప్రతినిధి తెలిపారు. బాంబు దాడి అనంతరం తాలిబన్లు అఫ్గాన్​ సైనికుల మధ్య కాల్పులు జరిగాయి.

"సైనిక స్థావరంలో 18 మంది సైనికులు పహారా కాస్తున్నారు. బాంబు దాడిలో 10 మంది మరణించగా నలుగురు సైనికులు గాయపడ్డారు. మరో నలుగురు తాలిబన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. "

-నవాబ్​ జద్రాన్​, సైనిక ప్రతినిధి

దాడి మేమే చేశాము

ఈ దుశ్చర్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు తాలిబన్లు. మంగళవారం ఉత్తర బల్క్​ రాష్ట్రంలోనూ ఏడుగురు అఫ్గాన్​ సైనికులను పొట్టన బెట్టుకున్నారు తాలిబన్లు.

ఇదీ చూడండి : సోమాలియాలో కారు బాంబు పేలి 73 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details