54 మంది భారత జాలర్లను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసిందని భారత అధికరులు తెలిపారు. శుక్రవారం నాడు 40మందిని, శనివారం 14 మందిని విడుదల చేశారని వెల్లడించారు.
మార్చి 24న శ్రీలంక సముద్ర జలాల్లోకి 54 మంది భారత జాలర్లు ప్రవేశించగా.. వారిని నౌకాదళం అధికారులు అరెస్టు చేశారు. మానవతా దృక్పథంతో వారిని విడుదల చేయాలని భారత హైకమిషనర్.. శ్రీలంక ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందుకు పొరుగు దేశం సానుకూలంగా స్పందించింది.