తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంకలో ఇస్లామిక్ స్టేట్​​ ఉగ్రసంస్థలపై నిషేధం

శ్రీలంకలో బాంబుదాడులకు పాల్పడ్డ ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రసంస్థలపై నిషేధం విధించారు ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. తదుపరి ప్రకటన వచ్చేదాకా దేశ వ్యాప్తంగా డ్రోన్లు వినియోగించకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొలంబోలో బాంబు దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

By

Published : May 15, 2019, 5:17 AM IST

శ్రీలంకలో ఇస్లామిక్ స్టేట్​​ ఉగ్రసంస్థలపై నిషేధం

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రసంస్థలపై నిషేధం

శ్రీలంకలో వరుస బాంబు దాడులు చేసిన నేషనల్​ తౌహీత్ జమాత్​(ఎన్​టీజే)తో పాటు 'జమాతే మిలాతే ఇబ్రహీమ్​(జేఎమ్​ఐ)', 'విల్లాయత్​ అస్​ సెలాని(డబ్ల్యూఏయస్​)' ఉగ్రసంస్థలపై నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. దేశంలో డ్రోన్ల వినియోగంపైనా నిషేధం విధిస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. గత నెల 21న ఈస్టర్ పర్వదినాన కొలంబోలో జరిగిన వరుస బాంబుదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మారణహోమంలో 250 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details