తెలంగాణ

telangana

ETV Bharat / international

''దాడులు జరుగుతాయని ముందే తెలుసు''

శ్రీలంక హోటళ్లు, చర్చిలపై ఆత్మాహుతి దాడిపై ముందే సమాచారముందని పేర్కొన్నారు ఆ దేశ ప్రధాని రనిల్​ విక్రమసింఘే. కొలంబోలోని భారత హై కమిషన్​ సహా.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని తెలిపారు.

By

Published : Apr 24, 2019, 6:15 AM IST

దాడులపై ముందే సమాచారం

దాడులపై ముందే సమాచారం

శ్రీలంకలో ఈస్టర్​ సండే పేలుళ్లపై ముందస్తు సమాచారం ఉన్నా... ఆపడంలో విఫలం చెందినట్లు పేర్కొన్నారు ఆ దేశ ప్రధాని రనిల్​ విక్రమసింఘే. భద్రతా వ్యవస్థను పటిష్ఠ పరిచే విధంగా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు​.

పేలుళ్ల కేసు ఛేదించేందుకు లంక పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎందరో అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ.. పురోగతి కనబర్చారన్నారు. దాడికి పాల్పడిన బాంబర్లు విదేశాలకు వెళ్లి వచ్చిన ఆధారాలు దర్యాప్తు సంస్థలు సేకరించినట్లు తెలిపారు.

న్యూజిలాండ్​ క్రెస్ట్​చర్చ్​ దాడికి ప్రతీకారంగా.. శ్రీలంకలో పేలుళ్లు జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రధాని విక్రమసింఘే.

ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి, ఇంటర్​పోల్​ సాయంతో ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు.

పేలుళ్లను ఖండించిన ఐరాస భద్రతా మండలి...

శ్రీలంక హోటళ్లు, చర్చిలపై ఆత్మాహుతి దాడులను తీవ్రంగా ఖండించింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. ఇదొక భయంకరమైన, పిరికిపందల చర్యగా అభివర్ణించారు మండలి అధ్యక్షుడు క్రిస్టోఫ్​ హ్యూజెన్​. బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలను చేపట్టాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు క్రిస్టోఫ్​.

మృతుల్లో 45 మంది చిన్నారులు...

ఈస్టర్​ సండే పేలుళ్లలో మృతి చెందిన 321 మందిలో.. దాదాపు 45 మంది చిన్నారులేనని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలిపింది. మరికొంత మంది ప్రాణాలతో పోరాడుతున్నట్లు యునిసెఫ్​ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details