తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇళ్లపై కూలిన పాక్​ ఆర్మీ విమానం-17 మంది మృతి

పాకిస్థాన్​లోని రావల్పిండి నగరానికి సమీపంలో ఆ దేశ సైన్యానికి చెందిన విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బిందితో సహా 17 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

By

Published : Jul 30, 2019, 6:40 AM IST

Updated : Jul 30, 2019, 10:53 AM IST

ఇళ్లపై కూలిన పాక్​ ఆర్మీ విమానం-15 మంది మృతి

పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. రావల్పిండి నగరానికి సమీపంలోని మొరకలు గ్రామంలో ఆ దేశ సైన్యానికి చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లోఐదుగురు సిబ్బంది, 12 మంది స్థానికులు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని సైన్యాధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:బ్రెజిల్​ జైలులో ఘర్షణ-52 మంది మృతి

Last Updated : Jul 30, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details