సింగపూర్లోని చాంగి జైలులో శిక్ష అనుభవిస్తున్న నాగేంద్రన్ కె.ధర్మలింగంకు ఉరిశిక్ష అమలుపై సింగపూర్ ప్రభుత్వం స్పందించింది. నాగేంద్రన్కు మానసిక వైకల్యం లేదంటూ వైద్యులిచ్చిన సాక్ష్యాలను కోర్టు పరిగణించిదని స్పష్టం చేసింది. ఈ నెల 10న మరణశిక్ష విధించనున్నట్లు తేల్చిచెప్పింది. నాగేంద్రన్ ఉరిశిక్ష రద్దుచేయాలంటూ మానవ హక్కుల సంఘాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించిందీ కేసు.
అతని ఉరిశిక్ష రద్దు కోరుతూ అక్టోబర్ 29న ఆన్లైన్ వేదికగా ప్రారంభమైన ఓ పిటిషన్పై 56,134 మంది సంతకాలు చేశారు. నాగేంద్రన్ ప్రాణాలు కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నవంబర్ 10న నాగేంద్రన్కు మరణశిక్ష అమలు చేయబోతున్నట్లు సింగపూర్ జైలు అధికారులు అక్టోబర్ 26న తన తల్లికి లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వరుస తిరస్కరణలు..
- 2009లో సింగపూర్లోకి 42.72 గ్రాముల హెరాయిన్ను అక్రమ రవాణా చేస్తున్నాడనే అభియోగంపై నాగేంద్రన్కు 2010లో మరణశిక్ష విధించింది కోర్టు.
- తనపై మోపిన నేరారోపణలను కొట్టేయాలంటూ కోర్టును ఆశ్రయించగా 2011-సెప్టెంబర్లో అప్పీల్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
- ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ కారాగారశిక్ష విధించాలని 2015లో నాగేంద్రన్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ దరఖాస్తును హైకోర్టు 2017లో కొట్టివేసింది.
- 2019లో చేసుకున్న మరో అప్పీల్ను కోర్ట్ ఆఫ్ అప్పీల్ తిరస్కరించింది. చివరిగా క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ సైతం తిరస్కరణకు గురైంది.
'మానసిక వైకల్యం లేదు..'